- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
డెహ్రాడూన్: కొవిడ్ శాంపిళ్లను తరలించడానికి అవసరమైతే హెలికాప్టర్లను వాడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. భూపాతాల వల్ల రోడ్లు ధ్వంసమై కరోనా శాంపిళ్లను టెస్టుల కోసం ల్యాబరేటరీలకు తరలించడం కష్టమైతే, ఈ కారణంగా మారుమూల ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరించడానికి మూడు, నాలుగు రోజుల కంటే ఎక్కువ జాప్యం పడితే హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో భేటీలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ నేగి తెలిపారు. రోడ్ల ద్వారా వాహనాలు వెళ్లలేని పరిస్థితులుంటే సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ సమాచారమివ్వాలని, ఆ ఏరియాలోని కొవిడ్ శాంపిళ్లను ల్యాబ్కు తరలించడానికి డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్లు వెళతాయని వివరించారు.
Next Story