56 ముస్లిం దేశాలున్నాయ్ జాగ్రత్త.. మోడీకి కంచ ఐలయ్య వార్నింగ్

by Disha Web Desk 4 |
56 ముస్లిం దేశాలున్నాయ్ జాగ్రత్త.. మోడీకి కంచ ఐలయ్య వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలపై ప్రధాని మోడీ చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రొఫెసర్ కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. 200 మిలియన్ల ముస్లింలు ఉన్నారని.. వారిపై నిరంతరంగా ఎన్నికల రంగంలో భయపెట్టే భాషతో మాట్లాడితే ప్రపంచంలో 56 ముస్లిం దేశాలున్నాయి అవి గమనిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో మన దేశస్తులకు ప్రాబ్లమే కదా అన్నారు. హిందూ ఓట్ల పోలరైజేషన్‌‌కు ముస్లింలపై మాటల దాడి ఉపయోగపడదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. హిందువులలో కూడా కులాల వారీగా విభజించారు కదా అన్నారు. ఇక్కడ రెడ్లు, కమ్మలు, వెలమలు అధికారంలో ఉంటే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామనడం హిందూవుల మధ్య చీలిక కాదా అని ఐలయ్య ప్రశ్నించారు. బీసీ అనే ఈటల రాజేందర్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామంటున్నారు కాదా అని క్వశ్చన్ చేశారు. అంతా కలిసి దేశ ఉత్పత్తిని పెంచుకునే చర్చ జరగాలని తెలిపారు. కుల వ్యవస్థను మనం మార్చుకోవాలని.. ముస్లింలు వారి బలహీనతలను మార్చుకోవాలని ఆయన సూచించారు. మోడీ ఇంత పెద్ద ఎత్తున ముస్లింల ఇష్యూను రైస్ చేయలేదని.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి విషయాలు కాకుండా మేనిఫెస్టో గురించి మాట్లాడాలని హితవు పలికారు. అంతేకానీ ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాం.. వారు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు వాంటి అంశాలు మాట్లాడొద్దని సూచించారు.

Next Story

Most Viewed