విషాదం.. చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి

by Disha Web Desk 12 |
విషాదం.. చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల వికారాబాద్ జిల్లా ధరూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి వచ్చిన కుక్కింది గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి అదుపుతప్పి చికెన్ కర్రీ, సాంబార్ గిన్నెలో పడి పోయాడు. కాగా అక్కడే ఉన్న వారు గమనించి ఆయనను బయటకు తీసి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు.. మంగళవారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ఘటన మే2 చోటు చేసుకోగా.. మృతిని సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story