ఎమ్మెల్యే జీఎంఆర్‎ను కలిసిన రైతులు..!

by  |
ఎమ్మెల్యే జీఎంఆర్‎ను కలిసిన రైతులు..!
X

దిశ, పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారంలో వ్యవసాయ భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కు పేరిట తీసుకోవద్దని రైతులు కోరారు. ఈ సంద్భంగా జిన్నారం రైతులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, వార్డు మెంబర్లు, రైతులు, యువజన సంఘాల నాయకులు, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు పాల్గొన్నారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. రైతుల భూముల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయొద్దని జిన్నారం తహశీల్దార్ దశరథ్ సూచించారు. మంత్రి కేటీఆర్, టీఎస్ఐఐసీ చైర్మన్ నర్సింహారెడ్డిలను కలిసి రైతుల భూములలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయొద్దని వినతి పత్రం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed