నష్ట పరిహారం చెల్లించాకే..

by  |
నష్ట పరిహారం చెల్లించాకే..
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దివీస్ ఫార్మా కంపెనీ కోసం ఏర్పాటు చేస్తున్న హై టెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే దివీస్ కంపెనీ కాలుష్యంతో తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు విద్యుత్ టవర్ల నిర్మాణంతో భూమిని కోల్పోతున్నామని రైతులు వాపోయారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి టవర్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story