రెగ్యూలరైజేషన్ పేరుతో లక్షల్లో దోపిడీ..!

by  |
రెగ్యూలరైజేషన్ పేరుతో లక్షల్లో దోపిడీ..!
X

దిశ,సిద్దిపేట: రెగ్యులరైజేషన్ పేరుతో ఇంటి నిర్మాణానికి అయ్యే డబ్బును టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండల కేంద్రంలో డీసీసీ సమావేశం నిర్వహించారు. 200 గజాల ఇంటి స్థలం ఉన్న ప్రతి పేదవాడికి ఉచితంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన విధంగా.. ఇప్పడు ఇంటి నిర్మాణం చేసుకున్న ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు సాయం అందించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed