ఎనిమిది మంది జూదరుల అరెస్ట్

by  |
ఎనిమిది మంది జూదరుల అరెస్ట్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి, 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారయ్యారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు రూ.41,600 నగదు 11బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed