- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీపీ, షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. నేరుగా మందులు డోర్ డెలివరీ
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖలో కొత్త స్కీం అందుబాటులోకి రానుంది. బీపీ, షుగర్ పేషెంట్లకు కిట్లు ఇవ్వనున్నారు. మందులను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు నుంచి వీటిని పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. సాధ్యాసాధ్యాలపై మంత్రి హరీష్రావు అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అయితే వీటిని తొలి విడత 80 ఏళ్లు దాటిన వారికి ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరిలో సుమారు 18 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా వేసింది. ఇప్పటికే వీరందరికీ బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి బీపీ, మరో 7 లక్షల మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. వచ్చే నెల నుంచి వీరికి మందుల కిట్లు అందజేయనున్నారు. ఆ కిట్లో నెలకు సరిపోయే మందులు, వాడాల్సిన విధానం కరపత్రాలను కూడా ఉంచనున్నారు.
Next Story