మధులత కుటుంబానికి… రూ.కోటి పరిహారం ఇవ్వాలి

by  |
మధులత కుటుంబానికి… రూ.కోటి పరిహారం ఇవ్వాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడి మృతి చెందిన నిలోఫర్ ఆసుపత్రి టెక్నిషీయన్ మధులతకు ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ మాట్లాడుతూ… మధులత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను సత్వరమే అందించాలని విజ్ఞప్తి చేశారు. మధులత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.


Next Story

Most Viewed