కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తున్నారు : ఎంపీ అర్వింద్

by Shyam |
కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తున్నారు : ఎంపీ అర్వింద్
X

దిశ, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రాష్ర్ట ప్రభుత్వమే పక్కదారి పట్టిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కేటాయింపుల కింద కేంద్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి రూ.160 కోట్లు, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంటుకు రూ.25.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ అర్వింద్ అన్నారు. అయితే పనులకు కాకుండా ఈ నిధులను ఇతర అవసరాలకు వాడాటాన్ని సభ్యులు తప్పుపట్టారు. దీంతో ఎంపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను ఎలాగైనా ప్రతిపాదిత పనులకు మాత్రమే ఉపయోగించాలని లేకుంటే, వేరే పరిణామాలు ఉంటాయని మందలించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed