Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by D.Reddy |
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం తిరుమల తిరుపతి (Tirupathi) శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల (Devotees) రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వామిని దర్శించుకోగా.. 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్ల ఆదాయం సమకూరింది.

Next Story

Most Viewed