తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..

by srinivas |
tirupathi
X

దిశ, రాయలసీమ: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 3వ మలుపు వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ పటాన్ చెరువుకు చెందిన శివలింగం అనే భక్తుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు . స్వల్పగాయాలతో కారు డ్రైవర్ కృష్ణ బయటపడ్డాడు. ప్రమాదానికి గురైన వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో డ్రైవర్ పక్క సీట్‌లో ఉన్న వ్యక్తి తలకి బలమైన గాయాల కారణంగా మృతి చెందారు. ప్రమాదం జరగడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విజిలెన్స్, ఏవీఎస్వో సకాలంలో స్పందించి కారును తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed