- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం స్టేజీ వద్ద పెట్రోల్ పోసుకొని ప్రేమికులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని సెల్ఫీ వీడియో తీసి ఫ్రెండ్స్ కి పంపారు. లొకేషన్ ట్రేస్ చేసి ఫ్రెండ్స్ వచ్చే వరకే పూర్తిగా కాలిపోయి విగత జీవులుగా కనిపించారు.
వివరాల్లోకి వెళితే… షేక్ మస్తాన్ వలిది నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం కుంటిగొర్ల గూడెం. కాగా అశ్వినిది నిజామాబాద్ జిల్లా ఎడవెల్లి మండలం, జకంపేట. వీరిద్దరూ హైదరాబాద్ లో ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అక్కడ ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ చెవిటి మూగ వారు కావడం గమనార్హం
కాగా నాలుగేళ్ళ క్రితమే మస్తాన్ కి మరో యువతితో పెళ్లయింది. ఇప్పుడు అశ్విని, మస్తాన్ ల వ్యవహారం ఇంట్లో తెలియడంతో భయపడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీరిద్దరూ నిన్న రాత్రి బైక్ మీద సాగర్ కి వచ్చి సరదాగా గడిపినట్లు సమాచారం. అయితే అశ్విని చనిపోవడానికి ముందు తన తల్లికి వీడియో కాల్ ద్వారా చనిపోతానని తెలియజేసినట్టు తెలుస్తోంది.
Read Also..