విశాఖలో తీరని విషాదం..

by  |
విశాఖలో తీరని విషాదం..
X

దిశ, వెడ్‌డెస్క్: ఏపీలోని విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అగ్రహారం వద్ద చెట్టును ఢీకొనడంతో అందులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలోని నాతవరం మండలం, వలసం పేట వద్ద గురువారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Read Also…

దారుణం: తమ్ముడి కూతురిపై అత్యాచారం..!


Next Story