ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీలు స్పాట్ డెడ్

by Satheesh |   ( Updated:2024-06-14 04:49:24.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీలు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దతియా జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కకడే నలుగురు కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక్ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను దతియా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed