- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
BREAKING: రంగారెడ్డి జిల్లాలో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం, ఐదుగురు అరెస్ట్
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా.. వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్ఫోర్స్, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని ఎక్కడికక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్లో గంజాయి విక్రయిస్తున్నారని తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు అక్కడ నిఘా వేశారు. అనంతరం గంజాయి విక్రయిస్తున్న ఐదురుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.