BIG BREAKING: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

by Shiva |   ( Updated:2024-08-17 02:16:04.0  )
BIG BREAKING: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. తాజాగా, శనివారం తెల్లవారుజామున 2.32 నిమిషాలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్‌పై బండరాయి పెట్టడంతో గమనించని లోకో పైలెట్ రాయిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్వగాయలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story