మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

by Jakkula Mamatha |
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
X

దిశ, కళ్యాణదుర్గం:యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన కంబదూరు మండలం పరిధిలోని అండేపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన తిమ్మ రాయుడు, పద్మక్క దంపతుల మూడవ కుమారుడు సురేష్ ( 20) అనే యువకుడు వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉన్న యువకుడు కొద్ది నెలలుగా స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారనీ పోలీసులు వెల్లడించారు. అయితే తనకు వివాహం చేయమని కుమారుడు తల్లిదండ్రులను అడగగా వివాహం విషయం ఆలస్యం కావడంతో మనస్తాపానికి లోనై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story