ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. ఐదు నెలల పసికందుపై అత్యాచారం

by Satheesh |   ( Updated:2024-07-14 07:05:01.0  )
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. ఐదు నెలల పసికందుపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జీడీకవలసలో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ మృగాడు ఐదు నెలల పసికందుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో నుండి పసి కందును ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టింది పాప కు వరుసకు తాత అయ్యే వ్యక్తిగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story