పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో 55 మంది అరెస్ట్

by Disha Web Desk 18 |
పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో 55 మంది అరెస్ట్
X

దిశ,ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో పోలీసులు ఆదివారం 55 మందిని అరెస్టు చేశారు.పెనుగొండ పోలీస్ స్టేషన్ లో ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో నరసాపురం డీఎస్పీ శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిని కుమార్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన యువకుడిని విచారిస్తున్న సమయంలో ఈ నెల 21వ తేదీన కొంతమంది యువకులు స్టేషన్ లో దౌర్జన్యంగా జొరబడి స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు చేశామని తెలిపారు. ఆచంట గ్రామానికి చెందిన యువకుడు రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన పోస్ట్ పై అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

ఈ పోస్ట్ నేపథ్యంలో జరిగిన దాడిలో 22 వ తేదీన 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించామని డీఎస్పీ తెలిపారు.అందులో నలుగురు చిన్నపిల్లలు ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకుని..జువైనల్ హోమ్ కి పంపించామన్నారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా 23 మందిని ఐడెంటిఫై చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించినట్లు చెప్పారు. మరో పదిమంది చిన్న పిల్లలు ఆదివారం అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్ కి పంపించామని డీఎస్పీ చెప్పారు.ఈ కేసు దర్యాప్తులో ఉందని ఇంకా చాలా మందిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. మీడియా సమావేశంలో పెనుగొండ సీఐ రజిని కుమార్, ఎస్ఐ సుభాని పాల్గొన్నారు.


Next Story

Most Viewed