అంత్యక్రియలకు వెళ్తూ.. ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

by Aamani |
అంత్యక్రియలకు వెళ్తూ.. ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి
X

దిశ, దౌల్తాబాద్ (బొంరాస్ పేట్ ) : బంధువుల అంత్యక్రియలకు వెళ్తూ,ట్రాక్టర్ బోల్తా పడడంతో, మహిళ మృతి చెందిన ఘటన దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది.ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, దౌల్తాబాద్ మండలంలోని ఈర్లపల్లి గ్రామానికి చెందిన మాల లాలప్ప,నాగసారంలో బంధువు చనిపోతే,గ్రామం నుంచి ట్రాక్టర్ లో కుటుంబ సభ్యులతో వెళ్లారు. దేవరపస్లాబాద్ గ్రామ శివారులో ఉన్న కంది పొలంలోకి ట్రాక్టర్ దూసుకుపోయి బోల్తా పడింది. ట్రాక్టర్ అమృతమ్మ ఎదపై పడటంతో, ఆమెకు బలమైన గాయాలై, అక్కడికక్కడే మృతి చెందింది.ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.మృతురాలి భర్త మాల లాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు,కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed