బైక్ ని ఢీ కొట్టిన వ్యాన్.. ఇద్దరు మృతి

by Y.Nagarani |
బైక్ ని ఢీ కొట్టిన వ్యాన్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి శివారు శ్రీనివాసనగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నామ్ ఎక్స్ ప్రెస్ వే పై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన వాహనం సిబ్బందితో.. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్తోంది. అదే సమయంలో బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెంకు చెందిన షేక్ మీరావలి (55), వి.కొప్పేరపాడుకు చెందిన షేక్ ఖాసిం సైడా (52)లు టూ వీలర్ పై వెళ్తుండగా వాహనం ఢీ కొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకూ వారందరినీ వాహనం ఈడ్చుకెళ్లింది. స్థానికుల సమాచారంతో అక్కడికి 108 వాహనం చేరుకుంది. కానీ.. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed