దుండిగల్ పీఎస్ ను సందర్శించిన సీపీ..

by Sumithra |
దుండిగల్ పీఎస్ ను సందర్శించిన సీపీ..
X

దిశ, దుండిగల్ : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం దుండిగల్ పీఎస్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పీఎస్ ను సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించి స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం పీఎస్ పరిధిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రత విషయంలో రాజీలేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శ్రీనివాస రెడ్డి, దుండిగల్ సీఐ పి.సతీష్, ఎస్సైలు శంకర్ రాం మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed