AP News:టీడీపీలో విషాదం.. ఇద్దరు సీనియర్ నాయకులు మృతి

by Jakkula Mamatha |   ( Updated:2024-10-04 14:55:38.0  )
AP News:టీడీపీలో విషాదం.. ఇద్దరు సీనియర్ నాయకులు మృతి
X

దిశ, మాచర్ల: మాచర్ల నియోజకవర్గం టీడీపీలో శుక్రవారం విషాదం నెలకొంది. నియోజకవర్గంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న ఇద్దరు నాయకులు మృతి చెందారు. మాచర్ల మండలం తాళ్లపల్లి సర్పంచ్ పసుపులేటి బ్రహ్మ నాయుడు గురువారం గుండెపోటుతో మరణించారు, అదే రోజు రాత్రి పట్టణానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు ఎన్.బాలశౌరి చనిపోయారు. ఒకే రోజు ఇద్దరు పార్టీ నేతలు చనిపోవడం పార్టీ క్యాడర్‌లో విషాదం నింపింది. ఇద్దరికి ఎమ్మెల్యే.జూలకంటి బ్రహ్మరెడ్డి నివాళులు అర్పించారు.

సీనియర్ కార్యకర్తల మరణం పార్టీకి తీరని లోటు..

మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి బ్రహ్మనాయుడు మరణ వార్త తనను బాగా కలచి వేసిందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నాయకుడి ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటని చెప్పారు. తాళ్లపల్లి గ్రామంలో బ్రహ్మనాయుడు పార్థివదేహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ అండగా ఉంటుందని బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

మాచర్ల పట్టణానికి చెందిన మాజీ పట్టణ అధ్యక్షుడు వడ్డెర సంఘం నాయకులు బాలశౌరి మరణం పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే బ్రహ్మ రెడ్డి అన్నారు. బాలశౌరి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం పై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు పార్టీ నాయకులు కొమ్మెర దుర్గారావు ఎనుముల కేశవరెడ్డి విద్యా ధరణి మురళి సంబోజు వేణు అనంత రాములు కజం సైదయ్య నేరెళ్ల వీరస్వామి గుండాల శ్రీనివాసరావు కొమ్మెర శివ జూలకంటి వెంట ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed