రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి..

by Sumithra |
రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి..
X

దిశ, నవాబ్ పేట్ : నవాబ్ పేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన పులిగారి లక్ష్మారెడ్డి (72), కాశిపురం నాగేష్ (30) అనే ఇద్దరు వ్యక్తులు నగేష్ ద్విచక్ర వాహనం పై శుక్రవారం ఎల్లకొండ నుంచి శంకర్ పల్లి వెళ్తున్నారు. పర్వేద గ్రామానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఎల్లకొండ గేట్ వద్ద వాహనాన్ని ఢీకొట్టాడు.

ఈ రెండు బైకులు ఢీకొనడంతో ఎల్లకొండ గ్రామానికి చెందిన పులిగారి లక్ష్మారెడ్డి, కాశిపురం నాగేష్ అనే వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారు మృతి చెందారు. అదేవిధంగా పర్వేద గ్రామానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పర్వేద గ్రామానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తి అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ భూషణ్ తెలిపారు.

Next Story

Most Viewed