గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
X

దిశ,ఉప్పల్ : గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్‌ నల్ల చెరువుకట్ట ప్రాంతంలో బోడుప్పల్ కు చెందిన నక్క వినీత్, బల్కంపేటకు చెందిన మోక తేజస్ కృష్ణ, దమ్మైగూడకి చెందిన గరికల అనుదీప్ ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్డీటీం సీఐ నాగరాజు బృందం కలిసి మంగళవారం దాడి చేయగా కేజీ 230 గ్రాముల గంజాయి పట్టుబడింది.

ఈ ముగ్గురు చిరు ఉద్యోగులుగా పని చేస్తూ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. అన్‌లైన్‌లో గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా అమ్మకాలు చేపడుతున్నారు. వీరు గతంలో గంజాయికి అలవాటుపడి, దానిని కొనుగోలు చేసే శక్తి లేక పోవడంతో విక్రయదారులుగా మారారని సీఐ నాగరాజు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో కానిస్టేబుళ్లు రాజేష్‌, కాశీ, వికాస్‌, శశి కిరణ్‌, యాస్మీన్‌ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed