తల్లి మందలించిందని దారుణానికి తెగబడ్డ కుమారుడు

by Bhoopathi Nagaiah |
తల్లి మందలించిందని దారుణానికి తెగబడ్డ కుమారుడు
X

దిశ, గూడూరు : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. నవ మాసాలు మోసి జన్మనిచ్చి జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు కాలయముడయ్యాడు. క్రూర మృగంలా మారి తల్లిని దారుణంగా కొట్టి చంపాడు. గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కొడుకు మనోజ్ (22)ని తల్లి సుశీలమ్మ మందలించింది. దీంతో విచక్షణ కోల్పోయిన మనోజ్.. తల్లి తలపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్రగాయాలపాలయింది. కుటుంబ సభ్యులు వెంటనే సుశీలమ్మను గూడూరుకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వెద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed