కారును ఢీకొట్టిన లారీ.. ఆ సమయంలో కారులో నలుగురు..

by Kalyani |
కారును ఢీకొట్టిన లారీ.. ఆ సమయంలో కారులో నలుగురు..
X

దిశ, ఉప్పల్: కారును లారీ ఢీకొట్టిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కారు ఓనర్ సతీష్ మియాపూర్ నివాసి. శనివారం ఉదయం శ్రీశైలం ఫ్యామిలీతో వెళ్తుండగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఎక్కడికి అక్కడికి ఆగిపోయాయి. గ్రీన్ సిగ్నల్ పడగానే వాహనాలు స్టార్ట్ అయ్యే సమయంలో కారుకు కుడి వైపు ఉన్న లారీ ఢీకొట్టింది.

అలాగే లారీ డ్రైవర్ బిక్షపతి కొంత దూరం ముందుకు తీసుకెళ్లడంతో కారు కుడివైపు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారు లో ముగ్గురు వ్యక్తులు ఒక చిన్న పాపా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. ఉప్పల్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed