- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
విషాదం.. సెలవుల తర్వాత స్కూల్కు వెళ్లిన రోజే బాలిక ఆత్మహత్య
దిశ,వెబ్డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లిన కాసేపట్లోనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య(12) ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్య కుటుంబ సభ్యులు, ఊర్లో తోటి స్నేహితులతో సంతోషంగా గడిపింది. ఇక సెలవులు పూర్తి అవ్వడంతో నిన్న (గురువారం) ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ బాలిక తల్లితో తాను హాస్టల్లో ఉండనని ఇంటికి వచ్చేస్తానని మారం చేసింది. కానీ తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో ఉండటానికి ఒప్పుకుంది. హాస్టల్లో ఉంటాను కానీ నెలాఖరులో మళ్లీ రావాలని తల్లిదండ్రులను ఆ చిన్నారి కోరింది. సరే వస్తామని ఆ తల్లిదండ్రులు చెప్పారు.
కానీ.. తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేని ఆ బాలిక మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు హాస్టల్లో విడిచి వెళ్లిన గంటకే మనస్తాపానికి గురైన విద్యార్థిని గదిలోకి వెళ్లి జడ రిబ్బనుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భోజన విరామ సమయంలో ఆత్మహత్య చేసుకున్న బాలికను తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో టీచర్లు అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిని స్నేహితులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోధించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.