తీవ్ర జ్వరంతో నిద్రలోనే బాలుడు మృతి

by Kalyani |   ( Updated:2024-10-22 08:52:10.0  )
తీవ్ర జ్వరంతో నిద్రలోనే బాలుడు మృతి
X

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలం సబ్ స్టేషన్ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోతు జయంత్ (2) మంగళవారం అకాలంగా మృతి చెందాడు. గ్రామస్తులు, మృతుని తల్లిదండ్రులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జయంత్ గత 3 రోజుల క్రితం జ్వరం బారిన పడినట్లు తెలిపారు. నిద్రిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు గుర్తించారని తెలిపారు. జయంత్ అకాల మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా జయంత్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed