- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి
దిశ, ఇబ్రహీంపట్నం: గుర్తుతెలియని మహిళా అనుమానాస్పద మృతి చెందినట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు. నాదర్గుల్లోని పార్వతీపురం సమీపంలో ఉదయం స్థానికులు తిరుగుతున్న క్రమంలో శవం కనిపించడంతో ఈ విషయాన్ని ఆదిబట్ల పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆమె వయస్సు 55 యేండ్లు ఉండవచ్చునని, పింక్ కలర్ చీర, పసుపు రంగు బ్లౌజ్ ధరించి ఉందని వివరించారు. పోలీసులు స్ధానికులను విచారణ చేయగా నాదర్గుల్ టాటా ఏరోస్పేస్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసినట్లు తెలిపారు. గత 10 రోజుల నుంచి అనారోగ్యంతో, మానసిక పరిస్థితి బాగోలేదని, ఐదు రోజుల క్రితం స్థానిక ఆశ్రమ ఇంచార్జీ గోపీనాయక్, మరో వ్యక్తి ప్రవీణ్లు ఇద్దరు ఆమెకు ఆహారం అందించగా ఆమె తిరస్కరించిందని సమాచారం. మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.