- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కొంపముంచిన ఇన్స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయి పుట్టింటికి వచ్చిన మహిళ ఏం చేసిందో తెలుసా?
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: సోషల్ మీడియాలో పరిచయం చివరకు ఒక యువతి మృతికి కారణమైంది. పలువురు సోషల్ మీడియా మాయలో పడి మోసపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వివాహిత ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్స్టాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆపై వారిద్దరి మధ్య చాలా సార్లు ఫోన్ సంభాషణలు నడిచాయి.
మాయమాటలు చెప్పి..
ఈ క్రమంలో వివాహితకు మాయమాటలు చెప్పటంతో ఆమె తన వద్ద ఉన్న విలువైన బంగారు నగలు, రూ.4 లక్షల నగదు ఆ వ్యక్తికి ఇచ్చింది. ఆపై బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలికి ఒక పాప ఉన్నట్లు తెలిసింది. మృతురాలి సోదరుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్టాలో పరిచయం అయిన వ్యక్తి విశాఖపట్నానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు గతంలో ఇంకా ఎవరినైనా ఈ విధంగా మోసం చేశాడా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.