- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరోసారి కాల్పుల మోత మోగింది. శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దంతెవాడ - నారాయణపూర్ సరిహద్దులో జరిగిన ఈ ఎన్కౌంటర్(Encounter)లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. మృతుల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని బొంతలంక-జారాపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నుంచే కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల శిబిరం వద్దకు చేరుకునే టైంలో మావోయిస్టులు పోలీసులను గమనించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్పారు. ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.