AP News:ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి:సీపీఎం

by Jakkula Mamatha |
AP News:ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి:సీపీఎం
X

దిశ,శ్రీకాళహస్తి:రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాళహస్తిలో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఎం నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని నాయకులు ప్రకటించారని, అయితే నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed