ఆర్థిక ఇబ్బందులు తాళలేక జర్నలిస్టు ఆత్మహత్య..

by Aamani |
ఆర్థిక ఇబ్బందులు తాళలేక  జర్నలిస్టు ఆత్మహత్య..
X

దిశ, వాంకిడి : మండలంలోని ఖిరిడీ గ్రామానికి చెందిన వడ్లూరి సురేష్ 42. గురువారం రాత్రి మద్యం మత్తులో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సూర్య దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న సురేష్ గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇదే క్రమంలో తన పిల్లల కనీస అవసరాలు కూడా తీర్ఛాలేక పోతున్నానని మనస్థాపానికి లోనై మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన బైక్ పై ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed