మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. బస్సు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

by Shiva |
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. బస్సు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, బయ్యారం: స్కూల్ బస్సు, బైక్‌ను ఢీకొట్టగా వ్యక్తి దుర్మరణం పాలైన విషాద ఘటన బయ్యారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌరారం గ్రామానికి చెందిన సింగరబోయిన కృష్ణ (36) బైక్‌పై మహబూబాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన విద్యాభారతి ప్రైవేటు స్కూల్ బస్సు, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, మృతుడి మామ కొరవి మండల పరిధిలోని మాదాపురంలో సోమవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు వెళ్తుండగా అల్లుడు కృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed