కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తీ.. వైరల్ అవుతున్న వీడియో

by Hamsa |
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తీ.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సత్య సుందరం’ ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. అయితే ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా, కార్తీ ‘సత్యం సుందరం’ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

అంతేకాకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ అమ్మవారు అంటే మా కుటుంబానికి చాలా ఇష్టం. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చాను. మా సినిమా చూసిన నాగార్జున అభినందించడం సంతోషంగా ఉంది. మా మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్తుంటే ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed