ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే..

by Sumithra |
ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే..
X

దిశ, కామారెడ్డి : షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యాధిగ్రస్తుడు జీవితం పై విరక్తి చెంది ఆసుపత్రిలోని బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలుకు గత వారం రోజుల క్రితం చేయికి గాయమైంది.

దీంతో అది ఇన్ఫెక్షన్ కావడంతో చికిత్స నిమిత్తం జీవధాన్ ఆసుపత్రిలో చేరాడు. అయితే షుగర్ తగ్గకపోవడంతో గాయం అధికమై తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలు ఆస్పత్రిలోని బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed