మూడేళ్లుగా సహజీవనం.. ఆపై ముక్కలు ముక్కలుగా మహిళ మృతదేహం

by Anjali |
మూడేళ్లుగా సహజీవనం.. ఆపై ముక్కలు ముక్కలుగా మహిళ మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే ముంబైలో మరో ఘటన వెలుగుచూసింది. ప్రియురాలిని, ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. 56 ఏళ్ల మనోజ్ సహాని, తన ప్రియురాలు సరస్వతితో కలిసి ముంబైలోని మీరారోడ్ ప్రాంతంలోని ఆకాశగంగ భవనంలోని ప్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, వీరి ప్లాట్‌లో నుంచి దుర్వాసన వస్తుందని, చుట్టుపక్క వాళ్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని విచారించగా.. మహిళ దారుణ హత్యకు గురైనట్లు తేలింది. దీంతో, నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మహిళను నరికి చంపాడని, ఇంకా దర్యాప్తు జరుగుతోందని ముంబై డీసీపీ జయంత్ బజ్బలే తెలిపారు.

Next Story

Most Viewed