క్రిమి సంహారక మందు తాగి జర్నలిస్టు ఆత్మహత్య.. వాంకిడి మండల పరిధిలోని ఘటన

by Shiva |
క్రిమి సంహారక మందు తాగి జర్నలిస్టు ఆత్మహత్య.. వాంకిడి మండల పరిధిలోని ఘటన
X

దిశ, వాంకిడి: క్రిమి సంహారక మందు తాగి జర్నలిస్టు మృతి చెందిన ఘటన వాంకిడి మండల పరిధిలోని శిరిడీ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వడ్లూరి సురేష్ (42) ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన గురువారం రాత్రి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సరేష్ చికిత్స నిమిత్తం హుటాహుటిన బైక్‌పై ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల రెఫెర్ చేశారు. ఈ క్రమంలోనే నరేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, అతడు ఎందుకు ఆత్మహత్య పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed