సీతాఫలాలకు వెళ్లి భార్యాభర్తలు మృతి..

by Kalyani |
సీతాఫలాలకు వెళ్లి భార్యాభర్తలు మృతి..
X

దిశ, రేవల్లి: సీతాఫలాల కోసం వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురై భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన శుక్రవారం వనపర్తి జిల్లా కొత్త బండరాయి పాకులా గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుసు బక్కయ్య(50), నాగమ్మ(46) దంపతులు తమ గ్రామానికి సమీపంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి గట్టుకు సీతాఫలాల కోసం వెళ్లారు. అక్కడ విద్యుత్ వైర్లను గమనించకుండా సీతాఫలాలు తెంపడం లో నిమగ్నమైయ్యారు. ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో భార్య భర్తలు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు అందాల్సి ఉంది. కాగా మృతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పండగ సమయంలో సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed