అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడు మృతి

by Aamani |
అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడు మృతి
X

దిశ ,చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల అందించిన వివరాల ప్రకారం..బాత్రూం నుండి నీరు బయటకు వచ్చి ఇంటి ముందు అపరిశుభ్రతకు చోటు చేసుకుంటుందనే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో తమ్ముడు కోడిపె మల్లయ్య (45) తలపై అన్న భీమయ్య కర్రతో బలంగా బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ హాస్పిటల్ తరలించగా బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed