విద్యుత్ మోటార్లు, టూవీలర్ల దొంగ అరెస్ట్

by Sridhar Babu |
విద్యుత్ మోటార్లు, టూవీలర్ల దొంగ అరెస్ట్
X

దిశ,సత్తుపల్లి : వ్యవసాయ విద్యుత్ మోటార్లు, టూ వీలర్ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని పెనుబల్లి పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు ఏసీపీ ఏ. రఘు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన షేక్ మౌలాలి గత కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పెనుబల్లి మండలం ఉప్పలచిలక గ్రామ శివారులో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పెనుబల్లి నుంచి కొత్తగూడెం వెళ్తున్న మౌలాలిని అనుమానం వచ్చి వివరాలు అడగగా పొంతనలేకుండా సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు.

విచారించగా ఈనెల 17వ తేదీ రాత్రి పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో టూవీలర్ దొంగిలించానని, గతంలో విద్యుత్ మోటార్లు, టూ వీలర్లు చోరీ చేసినట్టు నేరం అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. ఇతనిపై గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, జి కొండూరుతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్టు తెలిపారు. నిందితుని వద్ద ఉన్న రెండు బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, పెనుబల్లి ఎస్ఐ వెంకటేష్, వేంసూర్ ఎస్సై, వీరప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed