మద్యం తాగిన మైకంలో డ్రైవింగ్.. పల్టీ కొట్టిన కారు.. పలువురికి గాయాలు

by Kalyani |
మద్యం తాగిన మైకంలో డ్రైవింగ్.. పల్టీ కొట్టిన కారు.. పలువురికి గాయాలు
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని మహాదేవుని పేట గ్రామ శివారులో మద్యం తాగిన మైకంలో ఉన్న డ్రైవర్ కారు డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నుంచి బుద్ధారం కారులో వెళ్తుండగా డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో దేవా చారి, లక్ష్మణ్ చారి, ఇంద్రజ, వనజ లు ఉన్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed