కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ సీనియ‌ర్ నాయ‌కులు నూక‌ల న‌రేష్ రెడ్డి క‌న్నుమూత‌

by Sumithra |
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ సీనియ‌ర్ నాయ‌కులు నూక‌ల న‌రేష్ రెడ్డి క‌న్నుమూత‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ సీనియ‌ర్ నాయ‌కులు నూక‌ల న‌రేష్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌న్నుమూశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌లం పురుషోత్త‌మ‌య‌గూడెం గ్రామానికి చెందిన ఆయ‌న గ‌త కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ న‌రేష్ రెడ్డి మృతి చెందారు. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన ఆయ‌న 1994లో డోర్న‌క‌ల్ నుంచి స్వతంత్ర అభ్య‌ర్థిగా ఎమ్మెల్యే ప‌ద‌వికి పోటీ చేశారు.

1999లో తెలుగుదేశం పార్టీలో చేరి MLA అభ్యర్థిగా పోటీ చేశారు. రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు టీఆర్ఎస్‌లో చేరిన ఆయ‌న రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ఖ‌మ్మం జిల్లా టీఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జిగా కూడా ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక రేవంత్ రెడ్డి ఆహ్వానంతో చేయి పార్టీలోకి వెళ్లారు. డోర్న‌క‌ల్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన ఆయ‌న మ‌ర‌ణం పై ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed