- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కాలనీ అంతా దుర్వాసన...వెళ్లి చూడగా....
దిశ, తాండూరు : ఓ ఇంట్లో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. దుర్వాసన రావడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
అప్పటి వరకు కాలనీలో దుర్వాసన రావడంతో అక్కడి వారంతా దానిపై దృష్టిసారించారు. అది ఓ ఇంట్లో నుంచి వస్తుందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అలీ రహమాన్ (38) అనే వ్యక్తి ఇంట్లో మృతి చెంది కుళ్లిపోయి కనిపించాడు. అలీ 3 రోజుల క్రితం నిద్రలోనే మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- A rotting corpse