తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. రూ.నాలుగు లక్షల సొత్తు మాయం

by Aamani |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. రూ.నాలుగు లక్షల సొత్తు మాయం
X

దిశ,వెల్దుర్తి : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మంగళ శ్రీనివాస్ తన షాప్ పై ఉన్న ఇంట్లో తనకుమారుడు సాయి,కోడలు ఉంటున్నారు. కుమారుడు సాయికి గత రెండు రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం రావడంతో గ్రామంలోని తమ పాత ఇంటి వద్ద ఉంటున్నారు.ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి అందులోని నాలుగు తులాల నరా బంగారు ఆభరణాలతో పాటు 20 తులాల వెండిని, రూ.ఐదు వేల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు.కుమారుడు సాయి వివాహం గత కొద్ది నెలల క్రితం జరగడంతో పెళ్లికి పెట్టిన బంగారం ఇంట్లోనే పెట్టడంతో విలువైన వస్తువులను దోచుకెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు.బస్టాండ్ సమీపంలోనే ఈ ఘటన జరగడం తో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed