ఘోర రోడ్డు ప్రమాదం.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి

by Jakkula Mamatha |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఎల్విన్‌పేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ బుల్లిబాబు నేడు (గురువారం) కురుపాం మండలం జగడ-నీలకంఠంపురం ఘాట్‌రోడ్డు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పింది. దీంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ మరణం పట్ల జిల్లా పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed