మల్కారం వెంచర్లో మహిళ మృతదేహం లభ్యం..

by Sumithra |
మల్కారం వెంచర్లో మహిళ మృతదేహం లభ్యం..
X

దిశ, శంషాబాద్ : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెంది, మృతదేహం లభ్యమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వర్గారం గ్రామంలోని మధుపాల వెంచర్ లో మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం మృతదేహాన్ని పరిశీలించగా మృతురాలు 35-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటుందని, మృతి చెంది దాదాపు ఐదు రోజులు పైగా కావడంతో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైనది అన్నారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో మృతురాలికి పింకు కలర్ చీర, కండ్ల అద్దాలు, చెప్పులు, మెడలో తాళాలు ఉన్న పూసల దండ లభ్యమైందన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసునమోదు విచారిస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed