పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన మహిళ మృతి

by Sridhar Babu |
పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన మహిళ మృతి
X

దిశ, తిరుమలాయపాలెం : మండలంలోని బచ్చోడుతండాలో పిడుగుపడి ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ భూక్య శారద అనే మహిళ ఆది వారం మృతి చెందింది. బాధితులను మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా శారద అనే మహిళకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కిమ్స్ లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో శారద మృతి చెందింది. మృతురాలికి భర్త శంకర్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.

Advertisement

Next Story